MLC Kavitha: ఈ సారి నిజామాబాద్ నుంచి కాదు.. ఈ ఎంపీ ఎన్నికల్లో కవిత పోటీ ఎక్కడంటే?

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎంపీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గెలిచిన ఈ సీటులో విజయం సాధించాలన్న లక్ష్యంతో కవిత వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

New Update
MLC Kavitha: ఈ సారి నిజామాబాద్ నుంచి కాదు.. ఈ ఎంపీ ఎన్నికల్లో కవిత పోటీ ఎక్కడంటే?

MLC Kavitha Contest from Malkajgiri: తెలంగాణలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించగా.. మిత్రపక్షం సీపీఐ 1 సీటును సాధించింది. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) 39 సీట్లకు పరిమితం కాగా.. బీజేపీ 8 సీట్లను సొంతం చేసుకుంది. ఎంఐఎం ఏడుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో భారీగా సీట్లను సాధిస్తామని వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ మేజిక్‌ ఫిగర్ కన్నా కేవలం 4 సీట్లనే అధికంగా సాధించింది. దీంతో ఆ పార్టీ నేతలు పైకి ఆనందంగా ఉన్నా.. లోపల మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు. మళ్లీ అధికారం తమదేనని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ కు తీవ్ర నిరాశను మిగిల్చాయి ఈ ఎన్నికలు. ఇప్పటికీ తాము అధికారం ఎందుకు కోల్పోయామో ఇప్పటికీ అర్థం కావడం లేదని చెబుతున్నారు గులాబీ నేతలు. అధికారం దక్కకపోయినా.. ఓట్ల శాతం 7 నుంచి 14 శాతానికి పెంచుకున్న బీజేపీ మాత్రం కాస్త ఖుషీగా ఉంది. దీంతో ఈ ఎన్నికలు ఏ పార్టీకి కూడా పూర్తి సంతృప్తిని మిగల్చలేదు.
ఇది కూడా చదవండి: TS Pensions: తెలంగాణలో పింఛన్ లు రూ.4 వేలకు పెంపు.. ఎప్పటినుంచంటే?

ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) ఎలాగైనా సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో దూకుడు హస్తం నేతలు అదే ఉత్సాహంతో మెజార్టీ ఎంపీ స్థానాలను గెలిచి హైకమాండ్ కు గిఫ్ట్ ఇవ్వాలని వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతానికి రేవంత్ సర్కార్ పనితీరుపై సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్.. రానున్న రోజుల్లో బలమైన ఆరోపణలతో విరుచుకుపడేందుకు సిద్ధం అవుతోంది. ఎన్నికల సమయంలో భారీగా ఇచ్చిన హామీలు, వాటిని అమలుపై నిశితంగా పరిశీలిస్తున్న బీఆర్ఎస్.. ఎంపీ ఎన్నికల నాటికి దూకుడు పెంచి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు గెలిచి.. రాష్ట్రంలో తాము బలంగా ఉన్నామని చాటాలని భావిస్తోంది బీఆర్ఎస్. సీఎం కేసీఆర్ ఈ సారి మెదక్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఈ సారి నిజామాబాద్ నుంచి కాకుండా మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడింటిని గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ ధీమతో ఇక్కడి నుంచి కవిత పోటీకి దిగే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచారు. దీంతో తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం రేవంత్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారన్నది సైతం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.

Advertisment
తాజా కథనాలు