/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/KCR-2-jpg.webp)
BRS Chief KCR: రేపటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు కేసీఆర్. ఉప్పల్, ఎల్బీనగర్, చౌటుప్పల్ మీదుగా మిర్యాలగూడ బస్సు ద్వారా వెళ్లనున్నారు కేసీఆర్. సాయంత్రం 5.30 గంటలకు మిర్యాలగూడలో రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగిస్తారు.