KCR: కరెంట్‌ ఎందుకు పోతోంది.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్‌ ఫైర్!

New Update
KCR: కరెంట్‌ ఎందుకు పోతోంది.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్‌ ఫైర్!

BRS Chief KCR: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నాగర్‌కర్నూలలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ దిగిపోగానే కరెంట్‌ ఎందుకు పోతోంది అని నిలదీశారు. ఇవాళ శ్రీనివాస్ గౌడ్‌ ఇంట్లో అన్నం తింటుంటే 2 సార్లు కరెంట్‌ పోయిందని అన్నారు. సీఎం మాత్రం అసలు కరెంట్ పోవడం లేదని అంటున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం రైతులందరికీ రైతుబంధు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు తీసుకొచ్చానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు పంచాయతీ వచ్చిందని వ్యాఖ్యానించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు