KCR: పీవీకి భారతరత్న...తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం..!!

తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారత రత్న ప్రకటించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

KCR: పీవీకి భారతరత్న...తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం..!!
New Update

KCR On Bharat Ratna Award For PV Narasimha Rao :  తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న (Bharat Ratna) ప్రకటించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

పీవీకి భారతరత్న ప్రకటించిన కేంద్రానికి , ప్రధాని మోదీకి (PM Modi) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ ఘనంగా పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించింది. ఆయనకు భారతరత్న ప్రకటించాలని పార్టీ తరపున మేము కోరాము. పీవీకి ఈ అత్యున్నత పురస్కారం రావడం యావత్ తెలంగాణకు గర్వకారణమని ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు.

ట్విట్టర్‌లో మోదీ ఏం అన్నారంటే?

‘మన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు (PV Narasimha Rao) గారిని భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావు గారు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా (AP CM), కేంద్రమంత్రిగా, అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు, శాసనసభ సభ్యునిగా చేసిన కృషిని ఆయన సమానంగా గుర్తుంచుకుంటారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలకపాత్ర పోషించింది, దేశం యొక్క శ్రేయస్సు మరియు అభివృద్ధికి బలమైన పునాది వేసింది.

ప్రధానమంత్రిగా (Prime Minister) నరసింహారావు గారి పదవీకాలం భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్లకు తెరిచిన ముఖ్యమైన చర్యలతో గుర్తించబడింది, ఇది ఆర్థిక అభివృద్ధి యొక్క కొత్త శకాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంకా, భారతదేశం యొక్క విదేశాంగ విధానం, భాష మరియు విద్యా రంగాలకు ఆయన అందించిన సహకారం భారతదేశాన్ని క్లిష్టమైన పరివర్తనల ద్వారా నడిపించడమే కాకుండా దాని సాంస్కృతిక మరియు మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన నాయకుడిగా అతని బహుముఖ వారసత్వాన్ని నొక్కి చెబుతుంది.’ అని మోదీ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి:  ఆర్ధిక మంత్రం.. విదేశీ విధాన తంత్రం.. ఇదే పీవీ చాణక్యం 

పాములపర్తి వెంకట నరసింహారావు (28 జూన్ 1921 – 23 డిసెంబర్ 2004), ఒక భారతీయ న్యాయవాది, రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త, అతను 1991 నుంచి 1996 వరకు భారతదేశ 9వ ప్రధానమంత్రిగా పనిచేశారు. 28 జూన్ 1921 లక్నేపల్లి , హైదరాబాద్ రాష్ట్రం బ్రిటిష్ ఇండియా (నేటి తెలంగాణ , భారతదేశం)లో జన్మించారు.

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు నిజమైన పితామహుడు పీవీ. 1991లో పీవీ ముఖ్యమైన ఆర్థిక పరివర్తనను ప్రారంభించడానికి మన్మోహన్ సింగ్‌ను (Manmohan Singh) తన ఆర్థిక మంత్రిగా నియమించారు. పీవీ ఆదేశంతో మన్మోహన్ సింగ్ దాదాపుగా దివాలా తీసిన దేశాన్ని ఆర్థిక పతనం నుంచి రక్షించడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) విధానాలను అమలు చేసిన సంస్కరణలు దేశ స్థితిని మార్చేశాయి. ప్రపంచీకరణ దేశంలో ఆయన హయంలోనే మొదలైంది .

ఇది కూడా చదవండి: రైతుల పాలిట దేవుడు.. ఎన్నడూ ఓడిపోని వీరుడు.. భారతరత్న చౌదరి చరణ్‌ సింగ్‌!

#pv-narasimha-rao #kcr #brs #bharat-ratna
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe