ప్రైవేట్‌గా మాట్లాడాలని పిలిచి.. ప్రియురాలిపై కారు ఎక్కించి

ప్రేమించిన అమ్మాయిపై ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు దారుణాకిని పాల్పడ్డాడు. ముంబైకి చెందిన ప్రియా సింగ్ ను మాట్లాడాలని పిలిచిన అశ్వ‌జిత్ గైక్వాడ్.. ఆమెను దారుణంగా బూతులు తిట్టి భౌతికంగా దాడి చేశాడు. ప్రియా తిరగబడటంతో ఆమెపైకి కారు ఎక్కించి గాయపరిచాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
ప్రైవేట్‌గా మాట్లాడాలని పిలిచి.. ప్రియురాలిపై కారు ఎక్కించి

Love Tragedy : రహస్యంగా మాట్లాడాలని పిలిచి ప్రియారాలిపై దారుణానికి పాల్పడ్డాడు ఓ ప్రియుడు. తన గురించి తప్పుగా ప్రచారం చేసిందనే కోపంతో కొంతకాలంగా ఆమెపై కక్షపెంచుకుని టైమ్ కోసం వెయిట్ చేసిన ఆ యువకుడు.. చివరకు తన పగ తీర్చుకున్నాడు. ఇష్టం వచ్చినట్లు కొట్టి అమ్మాయిపై కారు ఎక్కించి గాయలపాలు చేసిన సంఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది.

ఈ మేరకు మ‌హారాష్ట్ర‌లోని థానేకు చెందిన ప్రియా సింగ్ అనే 26 ఏళ్ల అమ్మాయికి.. మ‌హారాష్ట్ర రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ అనిల్ గైక్వాడ్ కుమారుడు అశ్వ‌జిత్ గైక్వాడ్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీయడంతో ఐదేళ్లపాటు బాగానే ఉన్నారు. అయితే చిన్న చిన్న కారణాలతో కాస్త ఎడమొహం పెడమొహంగా ఉంటున్న వారిద్దరూ నెమ్మదిగా దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఓ ఫ్యామిలీ ఫంక్ష‌న్‌కు రావాలంటూ ప్రియాను అశ్వ‌జిత్ ఆహ్వానించాడు. ప్రియుడి మాటలు నమ్మి ఆ ఈవెంట్‌కు వెళ్లిన ప్రియపై ఫ్రెండ్స్‌తో క‌లిసి అశ్వజిత్ దురుస‌గా బిహేవ్ చేసినట్లు చెబుతూ సోషల్ మీడియాలో తనకు జరిగిన అన్యాయం గురించి వివరించింది.

ఇదికూడా చదవండి : హైదరాబాద్ లో దొంగ-పోలీస్ హైడ్రామా.. చివరికీ ఏమైందంటే

ప్రైవేట్‌గా మాట్లాడాలని చెప్పి ఎవరూ లేని ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బూతులు తిడుతూ నాపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా తన ఫ్రెండ్స్ తో కలిసి అసభ్యంగా ప్రవర్తించాడు. బూతులు మాట్లాడొద్దని చెప్పినా వినిపించుకోలేదు. ఎదురు తిరిగి మాట్లాడితే కొట్టాడు. నా గొంతును నొక్కే ప్ర‌య‌త్నం చేశాడు. బలంగా తోసేసి దూరంగా వెళ్తుంటే అత‌ని స్నేహితుడు నన్ను కింద‌ప‌డేశాడు. చావుదెబ్బ‌లు కొట్టి నాపైకి కారు ఎక్కించారు. తీవ్ర గాయలతో గంటసేపు రోడ్డుపైనే ఉన్నాను. కాసేపటికి అటువైపుగా వచ్చిన ఓ వ్యక్తి సహాయం చేశారని ప్రియా చెప్పుకొచ్చింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రియా ఈ ఘ‌ట‌నపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమెదు చేసుకుని విచార‌ణ చేపట్టినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు