Krishna River : కృష్ణా నదిలో పడవ ప్రమాదం.. ఆ ఎంపీతోపాటు 25 మంది ప్రయాణికులు..!

కృష్ణా నదిలో ఘోర ప్రమాదం తప్పింది. 25 మంది ప్రయాణికులతో రాయపూడి నుంచి బయలుదేరిన లాంచీ ఇబ్రహీంపట్నం దగ్గర ఇసుక దిబ్బలు తగలడంతో నది మధ్యలో నిలిచిపోయింది. అప్రమత్తమైన పోలీసులు అందరినీ రక్షించారు.

New Update
Krishna River : కృష్ణా నదిలో పడవ ప్రమాదం.. ఆ ఎంపీతోపాటు 25 మంది ప్రయాణికులు..!

NTR District : ఎన్‌టి‌ఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణా నది(Krishna River) లో ఘోర ప్రమాదం(Boat Accident) తప్పింది. 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న లాంచీ ఇసుక దిబ్బలు తగలడంతో నది మధ్యలో నిలిచిపోయింది. రాయపూడి నుంచి బయలు దేరిన లాంచీలో ఎంపి నందిగం సురేష్(Nandigam Suresh) బందువులు ఉన్నట్లు సమాచారం.

అయితే వెంటనే సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ముత్యాల సత్యనారాయణ.. అప్రమత్తంగా వ్యవహరించి స్థానిక మత్యకారుల సహకారంతో యుద్ద ప్రాతిపదికన పడవలోని ప్రయాణికులను రక్షించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు, వెస్ట్ జోన్ ఏసిపి మురళీ కృష్ణా రెడ్డి నేతృత్వంలో భద్రతా చర్యలు చేపట్టారు. ప్రయాణికులు తిరుగు ప్రయాణం అయినట్లు సమాచారం రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

Advertisment
తాజా కథనాలు