BJP MP : అనారోగ్యంతో బీజేపీ ఎంపీ కన్నుమూత!

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ..బీజేపీ లో విషాదం నెలకొంది. బీజేపీ ఎంపీ అనారోగ్యంతో కన్నుమూశారు. యూపీకి చెందిన హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్‌ వీర్‌ దిలేర్‌ అలీగఢ్‌ లోని ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు.

New Update
BJP MP : అనారోగ్యంతో బీజేపీ ఎంపీ కన్నుమూత!

BJP : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు(General Elections) సమీపిస్తున్న వేళ.. బీజేపీ(BJP) లో విషాదం నెలకొంది. బీజేపీ ఎంపీ అనారోగ్యంతో కన్నుమూశారు. యూపీకి చెందిన హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్‌ వీర్‌ దిలేర్‌(Rajvir Diler) అలీగఢ్‌ లోని ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు. చాలా కాలం నుంచి ఆయన అనారోగ్యం(Health Problem) తో బాధపడుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

ఆయన 2019 లో జరిగిన లోక్‌ సభ ఎన్నిక(Lok Sabha Elections) ల్లో హథ్రాస్‌ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు. ఈ సారి కూడా ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఆయన ఆకస్మిక మృతితో స్థానిక నేతలు, కార్యకర్తలు షాక్‌ కు గురయ్యారు.

దిలేర్ 2017లో ఇగ్లాస్ నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాత లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దిలేర్ మృతికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాజ్ వీర్ దిలేర్ అకాల మరణం చాలా బాధాకరం అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. బీజేపీకి, ఆయన కుటుంబానికి దిలేర్ మృతి తీరని లోటని సానుభూతి వ్యక్తం చేశారు.

Also read: తెలంగాణ టెన్త్‌ రిజల్ట్స్‌ ఎప్పుడంటే..క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం!

Advertisment
తాజా కథనాలు