మేము అసెంబ్లీకి వచ్చేది లేదు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

రేపు అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ ఎన్నికల్లో గెలిచినా ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు రేపు ప్రమాణస్వీకారం చేయరని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఎంఐఎం దే రాజ్యం నడుస్తుందని ఆరోపించారు.

New Update
మేము అసెంబ్లీకి వచ్చేది లేదు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

MLA Raja Singh: తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. కాసిం రిజ్వి వారసుడు అక్బరుద్దీన్ ఓవైసీ అని అన్నారు. ఒవైసీ ముందు బీజేపీ నేతలు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయరు అని స్పష్టం చేశారు.

15 నిమిషాలు సమయం ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తానని అన్న వ్యక్తి అక్బరుద్దీన్ అని మండిపడ్డారు. దేశానికి, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తికి ప్రోటేం స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ చేసిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఎవరు దోస్త్, ఎవరు దుస్మన్ అర్థం అవుతుందా? అని తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు.

ALSO READ: కవిత, కేటీఆర్ జైలుకే.. సుఖేష్ చంద్రశేఖర్ బహిరంగ లేఖ

బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎంకి ఇచ్చిన లెక్కనే కాంగ్రెస్ కూడా భయపడి తమ చెయ్యి నీ కూడా ఎంఐఎం చేతికి ఇస్తుందని అన్నారు. ఎందరో సీనియర్ లు ఉన్న ఆయనే ఎందుకు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉన్న, BRS ఉన్న, టీడీపీ ఉన్న రేపు బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వాళ్ళు కాళ్లు మొక్కి నెత్తి మీద కూర్చొనికి ప్రయత్నిస్తారని అన్నారు. రేవంత్ రెడ్డి నీ ఆరెస్సెస్ మనిషి, టిల్లు అని అన్న వ్యక్తి అక్బరుద్దీన్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో కూడా MIM దే రాజ్యం నడుస్తుందని అన్నారు.

Advertisment
తాజా కథనాలు