Raja Singh: 'నిన్ను లేపేస్తాం'..ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపులు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. శ్రీరామనవమి శోభా యాత్రను నిర్వహిస్తే కాల్చి చంపుతామంటూ రాజాసింగ్ కు గత కొన్ని రోజులుగా వేర్వేరు నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డీజీపీకి లేఖ రాశారు.

Raja Singh: మరో స్టాండప్‌ కమెడియన్‌ని టార్గెట్ చేసిన రాజాసింగ్..
New Update

BJP MLA Raja Singh: గోషామహల్ బీజేపీ (BJP) ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాజాసింగ్ ను గన్ తో కాల్చి చంపేస్తానంటూ ఓ వ్యక్తి కాల్ చేశాడు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ రావడం ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా రాజాసింగ్ కు చాలానే బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇందుకు కారణం రాజాసింగ్ హిందూ మతంపై ఉన్నప్రేమతో ఇతర మతాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే అని అంటున్నారు నెటిజన్లు.

ALSO READ: ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల

డీజీపీకి లేఖ...

తనకు తరచూ బెదిరింపు కాల్స్ రావడంపై తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు ఎమ్మెల్యే రాజాసింగ్. గత కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. శ్రీరామనవమి శోభా యాత్రను నిర్వహించవద్దని కాల్స్ చేసి బేరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ వారు చెప్పింది వినకుండా శ్రీరామనవమి శోభా యాత్రను (Sri Rama Navami) నిర్వహిస్తే తన కుమారుడిని కిడ్నప్ చేసి.. తనతో పాటు తన కొడుకుని గన్ తో కాల్చి చంపుతామంటూ గత కొన్ని రోజులుగా కొత్త నెంబర్లతో కొందరు బెదిరిస్తున్నట్లు డీజీపీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు.

ALSO READ: స్కిల్ స్కామ్ కేసులో ఊహించని ట్విస్ట్‌.. క్వాష్ పిటిషన్‌ సీజేఐకి బదిలీ..

#telangana-latest-news #mla-raja-singh #bjp-mla-raja-singh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి