తెలంగాణపై (Telangana Elections) ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం.. ప్రచార పర్వంలోకి అగ్రనేతలను దించేందుకు ప్లాన్ చేస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah), యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, స్మృతీ ఇరానీ, అమిత్ షా, హింత బిశ్వ శర్మ ప్రచారంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలలో మొదటి విడతగా వీరు రాష్ట్రానికి రానున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను బీజేపీ తాజాగా విడుదల చేసింది. 20వ తేదీన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తెలంగాణలో పర్యటించనున్నారు. 27న కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరో సారి రాష్ట్రానికి రానున్నారు. ఇంకా.. 28న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 31న యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: Telangana Congress: నేటి నుంచి మూడురోజులు కాంగ్రెస్ బస్సు యాత్ర
Telangana Elections: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ బిగ్ లీడర్స్.. అమిత్ షా, యోగీ ఆదిత్య నాథ్, స్మృతీ ఇరానీ షెడ్యూల్ ఇదే!
తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం.. ప్రచార పర్వంలోకి అగ్రనేతలను దించేందుకు ప్లాన్ చేస్తోంది. 20న స్మృతీ ఇరానీ, 27న అమిత్ షా, 28న అస్సాం హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలో పర్యటించేలా షెడ్యూల్ విడుదల చేసింది బీజేపీ.
Translate this News: