Bird Flu In Kerala : బర్డ్ ఫ్లూ(Bird Flu) మళ్లీ కలకలం రేపుతోంది. కేరళ(Kerala) లోని అలప్పుజాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు.దీంతో తమిళనాడులోని కోయింబత్తూరు లో హైఅలర్ట్ విధించారు. కేరళ సరిహద్దులోని 12 చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం చేసింది పరిపాలనా యంత్రంగం. అలప్పుజా జిల్లాతో కొయింబత్తూరు జిల్లా సరిహద్దు కలిగి ఉండటంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. కేరళ నుంచి బర్డ్ ఫ్లూ తమ జిల్లాలోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని కోయింబత్తూరు పరిపాలన యంత్రాంగం తెలిపింది. కేరళ ప్రభుత్వం అలప్పుజాలోని బాతుల్లో H1n1 రకం బర్డ్ ఫ్లూను గుర్తించింది. ఈ బాతుల బ్లడ్ శాంపిల్స్(Blood Samples) ను టెస్టుల కోసం భోపాల్ లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్’కు పంపించినట్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..Bird Flu : కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం..తమిళనాడులో హై అలర్ట్..!
కేరళలోని అలప్పుజా జిల్లాలోని రెండు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. దీంతో కోయింబత్తూరులో హై అలర్ట్ విధించారు. కేరళ సరిహద్దులోని 12 చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం చేసింది . అలప్పుజా జిల్లాతో కొయింబత్తూరు జిల్లా సరిహద్దు కలిగి ఉండటంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు .
Translate this News: