Araku : అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు బైకులు ఢీ.. నలుగురు మృతి

అరకు లోయ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా గంజాయి గుడ జాతరకు వెళుతున్న నాలుగు బైకులు, ఒక బైక్ తరువాత మరో బైక్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.

BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!
New Update

Road Accident : అరకు లోయ(Araku Valley) మండలంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది . మండలంలోని మాదల పంచాయతీ పరిధిలోకి వచ్చే దుమ్మ గుడ్రి - గంజాయి గుడ గ్రామాల మధ్యలో మూడు ద్విచక్ర వాహనాలు(Bikes) ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.

మహాశివరాత్రి(Maha Shivaratri) సందర్భంగా గంజాయి(Ganjam) గుడ జాతరకు వెళుతున్న క్రమంలో నాలుగు బైకులు ఢీకొన్నాయని , ఒక బైక్ తరువాత మరో బైక్ ఢీకొనడం తో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ సంఘటన లో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా , ఆస్పత్రిలో ఓ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు. అలాగే మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : మధుమేహంతో బాధపడేవారు ఏ పప్పులు తినవచ్చు..ఏ పప్పులు తినకూడదో తెలుసా?

#araku #four-died #accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe