Bigg Boss 7: నన్ను క్షమించండి బిగ్ బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న యావర్..?

బిగ్ బాస్ సీజన్ 7 లో కెప్టెన్సీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇంటి సభ్యులు 'దొరికితే దొంగ', 'ఫ్రూట్ నింజా ' టాస్కు ల్లో పాల్గొంటారు. ఈ రెండు టాస్క్ లు చాలా ఫన్నీ గా, ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి.

Bigg Boss 7: నన్ను క్షమించండి బిగ్ బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న యావర్..?
New Update

Bigg Boss 7 Captaincy Task:  కెప్టెన్సీ టాస్క్ కోసం ఇంటి సభ్యులు జంటలుగా విడిపోయారు. నిన్న జరిగిన టాస్క్ గురించి ఇంట్లో ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. ఇది చాలా తప్పు నిర్ణయం అంటూ ఇంటి సభ్యులు సంచాలకులైన యావర్, శోభా తో వాదిస్తూనే ఉన్నారు.

ఇక శివాజీ(Sivaji) అయితే నీకు ప్రశాంత్ అంటే నచ్చదు, అందుకే మేము అందరికన్నా ముందే బెల్ మోగించిన మాది ఫౌల్ గేమ్ అని చెప్పావు. అంటూ యావర్ పై ఆరోపణలు చేస్తాడు.యావర్ (Yawar) ఎంత చెప్పడానికి ట్రై చేసిన శివాజీ అర్థం చేసుకోరు. చివరికి యావర్ బిగ్ బాస్ నన్ను క్షమించండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.

దొరికితే దొంగ దొరక్కపోతే దొర

జంటలుగా విడిపోయిన ఇంటి సభ్యులకు బిగ్ బాస్ 'దొరికితే దొంగ దొరక్కపోతే దొర' అంటూ మరో టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్ లో (Task)  బిగ్ బాస్ కు సంబందించిన కొన్ని వస్తువులు తన స్నేహితుడితో ఉన్నాయని, అయితే తన స్నేహితుడి నిద్రను డిస్టర్బ్ చేయకుండా.. బిగ్ బాస్ ఇచ్చే హింట్ల ఆధారంగా ఆ వస్తువుల పేర్లను గెస్ చేసి వాటిని దొంగతనం చేయాల్సి ఉంటుందని ఆదేశిస్తారు. అలా ఎవరైతే ఎక్కువ వస్తువులు దొంగతనం చేస్తారో ఆ జంట ఈ టాస్క్ లో విజేతలుగా నిలిచి 3 స్టార్లు గెలుచుకుంటారని చెప్తారు.

దొంగతనానికి వెళ్లిన సభ్యులు బిగ్ బాస్(Bigg Boss)  చెప్పకముందే అన్ని వస్తువులు తీసి లోపల వేసుకుంటారు. అప్పుడు బిగ్ బాస్ చెప్పినవి మాత్రమే తీసుకోండి అంటూ వార్న్ చేస్తారు.

ఫోన్(Phone) కోసం శుభా, యావర్ గొడవ

దొంగతనం చేసిన వస్తువుల్లో బిగ్ బాస్ చెప్పిన ఒక ఐటెం(Item) తేజ చేతిలో ఉంటుంది. వెంటనే శోభా(Shobha) దాన్ని లాక్కుంటుంది. దాంతో యావర్ఎ, శోభా ఇద్దరు దాని కోసం కొట్టుకుంటారు చివరికి అది యావర్ చేతిలోకి వస్తుంది.

షాకిచ్చిన బిగ్ బాస్

బిగ్ బాస్ పెట్టిన నియమాలను ఏ మాత్రం పాటించకుండా చెప్పిన వస్తువులే కాకుండా, చెప్పనివి కూడా తెచ్చిన కారణంగా బిగ్ బాస్ చెప్పిన వస్తువుల ఆధారంగా కాకుండా, చెప్పని వస్తువులు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటాయో వాళ్ళు చివరి స్థానంలో ఉంటారని పెద్ద షాక్ ఇస్తారు.

దాంతో బిగ్ బాస్ చెప్పని వస్తువులు ఒక్కటి కూడా తీసుకురాని శివాజీ ప్రశాంత్ ఈ టాస్క్ లో మొదటి స్థానంలో ఉంటారు. అప్పటివరకు తమవే ఎక్కువ ఉన్నాయని మురిసిపోయిన సందీప్, అమర్ మొహాలు మాడిపోతాయి.

ఫ్రూట్ నింజా 

దొంగల టాస్క్ తర్వాత ఫ్రూట్ నింజా అనే టాస్క్ ఇస్తారు. దీంట్లో నిల్చున్న వ్యక్తి ఫ్రూట్ నీ అవతలి సభ్యుడి తల పై ఉన్న బుట్టలో వేయాలి. అన్ని పండ్లను బుట్టలో వేసాక వాటి నుంచి జ్యూస్ తీయాలి ఎవరు ఎక్కువ జ్యూస్ పిండుతారో వారే విజేతలు. యావర్, తేజ జంట అందరికన్నా ఎక్కువ జ్యూస్ పిండి మొదటి స్థానంలో ఉంటారు.

నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లు చాలా ఫన్నీగా ముగిసాయి. ప్రస్తుతానికి 5 స్టార్స్(Stars) తో శివాజీ, ప్రశాంత్ జంట లీడింగ్ లో ఉన్నారు.

Also Read: Hero Prabhas: హీరో ప్రభాస్ కు షాక్.. సెల్ఫీ కోసం వచ్చి చెంపదెబ్బ కొట్టిన యువతి

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-promo #bigg-boss-7-actor-sivaji #bigg-boss-7-contestants-telugu #bigg-boss-7-all-episodes
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి