MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో కవిత షాక్.. ఉచ్చు బిగిస్తున్న సీబీఐ

TG: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి సీబీఐ కేసులోనూ అప్రూవర్‌గా మారాడు. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో సెక్షన్ 164 కింద వాగ్మూలం ఇచ్చారు. కాగా ఈ కేసులో కవిత తనను బెదిరించిందని శరత్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో కవిత షాక్.. ఉచ్చు బిగిస్తున్న సీబీఐ
New Update

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కేసులోనూ నిందితుడు శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారాడు. అప్రూవర్‌గా మారిన తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం అందించారు. సెక్షన్‌ 164 కింద వాంగ్మూలాన్ని శరత్‌ చంద్రారెడ్డి ఇచ్చినట్లు సీబీఐ పేర్కొంది. శరత్‌ చంద్రారెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు ప్రత్యేక కోర్టు జడ్జి.

ఈడీ కేసులో గతంలోనే అప్రూవర్‌గా శరత్‌ చంద్రారెడ్డి మారిన విషయం తెలిసిందే. సీబీఐ, ఈడీ వేర్వేరుగా నమోదు చేసిన 2 కేసుల్లో అప్రూవర్‌గా శరత్‌ చంద్రారెడ్డి మారాడు. ఢిల్లీ మద్యం కేసులోనే గత నెలలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. కోర్టులో హాజరుపరిచాక తెలంగాణలో భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారాల్లో శరత్‌ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు సీబీఐ పేర్కొంది. ఇదే కేసులో మాగుంట రాఘవ, దినేష్ అరోరా అప్రూవర్లగా మారారు.

#mlc-kavitha #brs #liqour-scam-kavitha #kavitha-arrest
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి