AP: పీసీబీ ఫైల్స్ దగ్ధం.. కారణం అతడే.. భాను ప్రకాష్ రెడ్డి

పెద్దిరెడ్డి అవినీతి తిమింగలం అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి. విజయవాడలో పీసీబీ ఫైల్స్, హార్డ్ డిస్క్ దగ్ధం వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉండే ఉంటుందని అన్నారు. మిథున్ రెడ్డి దాడులు గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.

AP: పీసీబీ ఫైల్స్ దగ్ధం.. కారణం అతడే.. భాను ప్రకాష్ రెడ్డి
New Update

BJP Bhanu Prakash Reddy: బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి RTVతో మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్దిరెడ్డి అవినీతి తిమింగలం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెల్ల బంగారం లాంటి ఇసుక మాఫియాకి పాల్పడ్డారన్నారు. విజయవాడలో పీసీబీ ఫైల్స్, హార్డ్ డిస్క్ దగ్ధం వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉండే ఉంటుందని ఆరోపించారు.

Also read: ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు హల్‌చల్ .. తెలంగాణ వ్యక్తులపై దాడి..!

ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిపై చురకలు వేశారు. మిథున్ రెడ్డి దాడులు గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని సెటైర్లు వేశారు. తిరుమలను భ్రష్టు పట్టించిన అధికారులను ఎవరిని వదిలిపెట్టమన్నారు. రోజాకి ఓటమి నుంచి ఇంకా గుణపాఠం రాలేదని ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతుందని కామెంట్స్ చేశారు.

#roja #former-minister-peddireddy #bhanu-prakash-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe