Ram Mandir : జనవరి 22 దగ్గర పడుతోంది. శుభ ముహూర్తం ఆసన్న మవుతోంది. అయోధ్య(Ayodhya) లో రాముడు కొలువయ్యే వేళ సమీపిస్తోంది. దీంతో ఇక్కడ వేడుకలు ముమ్మరం అయ్యాయి. రామమందిరం ప్రారంభం, రాముని ప్రాణ ప్రతిష్ట వేడుకకు కూడా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పదిరోజులు ముందుగానే సంబరాలు మొదలెట్టేశారు. ప్రధాని మోడీ(PM Modi) తో సహా ట్రస్ట్ నిర్వాహకులు దీక్షలు చేపట్టారు. ప్రతీ కార్యక్రమాన్ని చాలా పవిత్రంగా నిర్వర్తిస్తున్నారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టకు మరో నాలుగు రోజులే మిగిలి ఉంది.
పూర్తిగా చదవండి..Ayodhya : అయోధ్య రామాలయం పోస్టల్ స్టాంప్ విడుదల..గర్భగుడిలోకి రాముని విగ్రహం
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు ప్రదాని మోదీ ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. మొత్తం ఆరు స్టాంప్లను విడుదల చేశారు. మరోవైపు అయోధ్య గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు ప్రతిష్టించారు.
Translate this News: