Vizag: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టిన లారీ..

విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

New Update
Vizag: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టిన లారీ..

Visakhapatnam, November 22: విశాఖపట్నం నగరంలోని ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలవగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ(Vizag)లోని సంగం శరత్‌ థియేటర్‌ కూడలి వద్ద స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. రైల్వే స్టేషన్‌ నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో ఆటో వెళ్తుండగా.. వెనుక వచ్చిన లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ఏడుగురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. రోడ్డుపై రక్తపు మడుగులో విలవిల్లాడిన చిన్నారుల నుంచి స్థానికులు తల్లడిల్లిపోయారు. వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కి కాల్ చేసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరు విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆటో ఢీకొట్టిన లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు వారిని పట్టుకున్నారు. చితకబాది పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్..

కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు..

Advertisment
తాజా కథనాలు