ఢిల్లీలో జగన్ చేసిన ధర్నాకు ఇండియా కూటమిలోని పార్టీల నేతలు హాజరై మద్దతు తెలపడంతో ఏపీలో కొత్త చర్చ ప్రారంభమైంది. జగన్ ఇండియా కూటమిలో చేరే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఏపీలో పీసీసీ చీఫ్ గా ఉన్న చెల్లి షర్మిలతో కలిసి జగన్ పని చేయాల్సి ఉంటుంది.