TS Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఆ ఆంశాలపై చర్చించవద్దని కండిషన్స్!
EC Green Signal To Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ (Election Commission) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని షరతులు పెట్టింది. ఎన్నికల విధుల్లో ఉన్న వారు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని విషయాలను చర్చించవద్దని తెలిపింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని నిబంధనలు పెట్టింది. అయితే.. రైతు రుణమాఫీ అంశంపై చర్చించడమే ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీ నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావించింది. మంత్రివర్గ సమావేశంలో రుణామాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం మంత్రివర్గ సమావేశానికి ఏర్పాట్లు చేసింది.
అయితే.. ఈసీ నుంచి అనుమతి రాకవడంతో ఆఖరి నిమిషంలో మంత్రి వర్గ సమావేశం రద్దు చేయాల్సి వచ్చింది. అయితే.. ప్రస్తుతం మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతి ఇచ్చినా.. రుణమాఫీ అంశంపై చర్చకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ప్రభత్వానికి నిరాశ తప్పలేదు. మరోవైపు ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరుతానని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అనేక సభల్లో స్పష్టం చేశారు. దీంతో ఆ తేదీలోగా రుణమాఫీ చేయడం ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక అంశంగా మారింది. దీంతో రుణమాఫీ చేయడం కోసం రేవంత్ సర్కార్ తీసుకునే నెక్ట్స్ స్టెప్ ఏంటన్న అంశం ఆసక్తికరంగా మారింది.
Also Read: TSPSC పేరు మార్చనున్న రేవంత్ సర్కార్.. కొత్త పేరు ఇదే?
TSPSC పేరు మార్చనున్న రేవంత్ సర్కార్.. కొత్త పేరు ఇదే?
TSPSC Board To Rename AS TGPSC: తెలంగాణ రాష్ట్రానికి బదులుగా సంక్షిప్తపదంగా ఇప్పటి వరకు వాడుతున్న టీఎస్ (TS)కు బదులుగా టీజీ (TG) వాడాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలసిందే. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Santhi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, స్వతంత్ర సంస్థలు ఇక మీదట టీజీకి బదులుగా.. టీఎస్ అని రాయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు, లెటర్ హెడ్స్, అధికారిక పత్రాల్లో ఇక మీదట టీజీ బదులుగా టీఎస్ నే వాడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.
టీఎస్ఎస్పీడీసీఎల్ ఇక నుండి టీజీఎస్పీడీసీఎల్
ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం pic.twitter.com/cwBRc4Qb9B
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2024
దీంతో అన్ని ప్రభుత్వ సంస్థలు టీజీకి బదులుగా టీఎస్ ను రాస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL).. పేరును టీఎస్ఎస్పీడీసీఎల్ గా (TGSPDCL) మార్చారు. అయితే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేరును కూడా ప్రభుత్వం త్వరలో మార్చనున్నట్లు తెలుస్తోంది. దీనిని TGPSCగా మార్చనున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వైద్య పరీక్షల కోసం అమెరికాకు చంద్రబాబు
మిర్యాలగూడలో ఈటల స్పీచ్-LIVE
AP Crime News: కర్నూలు శివారులో హిజ్రాల మృతదేహాలు.. ఎక్కడివి?
కర్నూలు శివారులో హిజ్రాల మృతదేహాలు కలకలం సృష్టించాయి. గార్గేయపురం చెరువులో రెండు మృతదేహాలతో పాటు.. ఒడ్డున మరో హిజ్రా మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఆధారాల కోసం పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆత్మహత్య లేక హత్య అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఎవరైనా తీసుకువచ్చి ఇక్కడ చంపి పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ కేసును త్వరగా ఛేదించాలని కోరుతున్నారు.