దేశంలో జమిలి ఎన్నికలు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కమిటీ కూడా వేసింది. అయితే జమిలి ఎన్నికల నిర్వహణపై 'లా కమిషన్' మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
మణిపుర్లో ఓ పోలీసు అధికారి కిడ్నాప్ కావడంతో అక్కడి పోలీసులు బుధవారం ఉదయం కొద్దిసేపు ఆయుధాలను వదిలేసి విధులకు హాజరయ్యారు. చివరికి భద్రతా బలగాలు రంగంలోకి దిగడంతో ఆగంతకులు ఆయన్ని గంటల వ్యవధిలోనే విడిచిపెట్టారు.
ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి సచిన్ టెండుల్కర్ జమ్మూకశ్మీర్లో పర్యటించగా.. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ సచిన్పై ప్రశంసల వర్షం కురిపించారు.
సమాజ్వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్కు బుధవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఆయన్ని సాక్షిగా పిలిచింది. 2012 నుంచి 2016 మధ్యకాలంలో నిబంధనలు ఉల్లంఘించి అధికారులు గనులు కేటాయించారనే ఆరోపణలు రావడంతో ఆయన్ని విచారించనుంది.
Sukhvinder Singh Sukhu : తాను ఎవరికీ రాజీమానా లేఖను సమర్పించలేదని హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ స్పష్టం చేశారు. తాను రాజీమానా చేసినట్లు బీజేపీ వందతులు వ్యాప్తి చేస్తోందని.. కాంగ్రెస్ ఐక్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. బడ్జెట్ సెషన్లో తాము మెజార్టీ నిరుపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Drugs : గుజరాత్ పోర్బందర్ తీరంలో అక్రమంగా తరలిస్తున్న నౌక నుంచి 3,300 కేజీల డ్రగ్స్ను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. మంగళవారం అనుమానస్పదంగా ఓ చిన్నపాటి నౌక భారత జలాల్లోకి ప్రవేశించగా.. అధికారులు దాన్ని ముట్టడించి సీజ్ చేశారు. ఆ నౌకలో ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల విండోస్ ల్యాప్టాప్ను కొనుగోలు చేశారు. అయితే మైక్రోసాఫ్ట్ అకౌంట్తో లాగిన్ కావాల్సి ఉండటంతో తన సమస్యను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్లకు మెసేజ్ పెట్టారు. మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేకుండానే కంప్యూటర్ వినియోగించుకునే ఆప్షన్కు తీసుకురావాలని కోరారు.
సైనిక కార్యకలాపాల్లో కృత్రిమ మేథ వినియోగం విస్తృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా తమ సైనిక కార్యకలాపాల్లో ఏఐ సాంకేతికతను వాడుతోందని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. ఈ నెల ప్రారంభంలో వైమానిక దాడులకు టార్గెట్లను గుర్తించేదుకు అమెరికా ఏఐ సాయం తీసుకున్నట్లు పేర్కొంది.
CM Jagan on AP Assembly Elections 2024: 45 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని గుర్తుపెట్టుకొని పార్టీ క్యాడర్ పనిచేయాలని సీఎం జగన్ పార్టీ కార్యకర్తలకు సూచించారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలను కూడా గుర్తుంచుకోలేకపోయారని ఇటీవల ఓ నివేదిక తెలిపింది. అయితే వీటిని బైడన్ తోసిపుచ్చారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా తన భార్యను వేరు పేరుతో పిలిచారంటూ విమర్శించారు.
Advertisment
తాజా కథనాలు