మీరు నా పెళ్లికి రాలేదుగా..అందుకే ఈ ఫైన్‌ కట్టాల్సిందే..ఓ వధువు వింత ఆలోచన!

పెళ్లికి పిలిచిన అతిథులు రాకపోవడం వల్ల వివాహ విందు వేస్ట్‌ అవ్వడంతో పాటు...కల్యాణ మండపం ఖర్చులు కూడా పెరిగాయని ఆస్ట్రేలియాకు చెందిన ఓ వధువు పెళ్లికి రాని అతిథులకు నోషో పేరుతో జరిమానా కట్టాలని తెలిపింది.

New Update
మీరు నా పెళ్లికి రాలేదుగా..అందుకే ఈ ఫైన్‌ కట్టాల్సిందే..ఓ వధువు వింత ఆలోచన!

సాధారణంగా మనం ఎవరినైనా పెళ్లికి పిలిచినప్పుడు వారు రాకపోతే ఏం చేస్తాం..తరువాత ఎప్పుడైనా వారు ఎందుకు రాలేదో తెలుసుకుంటాం..కానీ ఇక్కడ ఓ వధువు మాత్రం తాను పిలిచినా పెళ్లికి రాని వాళ్లందరకీ ఓ వింత షాక్‌ ఇచ్చింది. అది ఏంటంటే తన పెళ్లికి ఎవరైతే రాలేదో వారంతా కూడా ఫైన్‌ కట్టాలంటూ వారికి లేఖలు పంపింది.

వీటిని చూసిన అతిథులంతా షాక్‌ అవుతున్నారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. తన పెళ్లికి ఆహ్వానాలు పంపినప్పటికీ రాని వారందరూ కూడా కచ్చితంగా జరిమానా కట్టేల్సిందే అంటూ ఆ యువతి చెప్పుకొచ్చింది. ముందుగానే తాను అందరికీ తెలిపాను. వారందరూ పెళ్లికి వస్తారని నేను పెద్ద కల్యాణ మండపాన్ని తీసుకున్నాను.

అతిథులందరికీ సరిపడా భోజనాలు కూడా సిద్దం చేశాను. ఇప్పుడు పిలిచిన అతిథులందరూ రాకపోవడం వల్ల ఆ కల్యాణ మండపానికి పెట్టిన డబ్బు వృథా అయ్యింది. అంతేకాకుండా..భోజనాలు కూడా చాలా మిగిలిపోయి వృథా అయినట్లు ఆ వధువు పేర్కొంది. వాటికి అన్నింటికి కారణం పిలిచిన అతిథులు రాకపోవడమే.

అందుకే నోషో పేరుతో అతిధులకు జరిమానా విధించింది. కొంతమంది బంధువులు, స్నేహితులు ఏవో పిచ్చి కారణాలు చెబుతూ పెళ్లికి రావడానికి నిరాకరించారు. దీంతో ఖర్చు అయిన డబ్బును వారి దగ్గరే వసూలు చేయాలనుకుంటున్నట్లు నిర్ణయించుకున్నానని వధువు తెలిపింది. ఈ విషయం తెలిసిన బంధువులు, స్నేహితులు ఏంట్రా ఇది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Also read: కరోనా కొత్త వేరియెంట్ పై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!

Advertisment
తాజా కథనాలు