Krishna district: కృష్ణా జిల్లా అయ్యంకిలో దారుణం

కృష్ణా జిల్లా మొవ్వ మండల పరిధిలోని అయ్యంకిలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల నెపంతో కిరాతకులు భార్యాభర్తలను నడిరోడ్డుపై విచక్షణారహితంగా నరికి చంపారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

New Update
Murder: ఏపీలో దారుణం.. భర్తను స్క్రూడ్రైవర్‌తో అక్కడ పొడిచి చంపిన భార్య!

కృష్ణా జిల్లా మొవ్వ మండల పరిధిలోని అయ్యంకిలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల నెపంతో కిరాతకులు భార్యాభర్తలను నడిరోడ్డుపై విచక్షణారహితంగా నరికి చంపారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడు గణేష్, వరలక్ష్మిగా గుర్తించారు. గతంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు కొనసాగాయి. ఈ గొడవల్లో తమ్ముడు వీరకృష్ణ 2009లో హత్యకు గురైనట్లు పొలీసులు గుర్తించారు.

దీంతో వీరకృష్ణ కుమారులు తన తండ్రిని చంపిచ్చింది తమ పెదనాన్న గణేష్‌ అని కోపం పెంచుకున్నారు. వారు పెరిగే కొద్ది వారి పెదనాన్న గణేష్‌పై సైతం కోపాన్ని పెంచుకున్నారు. అంతే కాకుండా పాత ఆస్తికి సంబంధించిన గొడవలు ఇంకా సద్దుమనగకపోవడంతో ఆవేశంతో రగిలిపోయిన తమ్ముడి కుమారులు ఇవాళ ఉదయం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద పెదనాన్న గణేష్‌ను, రోడ్డుపై పెదమ్మ వరలక్ష్మిణి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం గణేష్‌ తమ్ముడి కుమారుల జాడ తెలియక పోవడంతో ఈ హత్యను వారే చేసి ఉండచ్చనే వాదనకు మరింత బలం చేకూరింది.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కాగా జంట హత్యలు చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆస్తికోసం జరిగిన హత్యలను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ఇంకా ఆ షాక్‌ నుంచి తేరుకోలేదు. కాగా ఈ అఘాయిత్యంలో ఎందరి పాత్ర ఉంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోవడంలేదు. దీంతో పోలీసులు సీసీ కెమెరాల ద్వారా విచారణ చేపట్టినట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు