ARMY JAWAN: స్వగ్రామానికి రామకృష్ణ రెడ్డి భౌతిక కాయం.. ప్రభుత్వ లాంచనాలతో మట్టి కార్యక్రమం

కశ్మీర్ లడక్‌లో ఆర్మీ రిహార్సల్స్ లో మృతి చెందిన ప్రకాశంజిల్లా కాల్వపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రామకృష్ణ రెడ్డి భౌతిక కాయం స్వగ్రామానికి చేరింది. గన్నవరం ఎయిర్ పోర్టులో గణ నివాళి అర్పించారు ప్రముఖులు. మంగళవారం అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

ARMY JAWAN: స్వగ్రామానికి రామకృష్ణ రెడ్డి భౌతిక కాయం.. ప్రభుత్వ లాంచనాలతో మట్టి కార్యక్రమం
New Update

Ramakrishna Reddy: కశ్మీర్ లడక్ లో జరిగిన ఆర్మీ రిహార్సల్స్ లో రెండు రోజులక్రితం మృతి చెందిన ప్రకాశంజిల్లా కాల్వపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ముత్తుమూల రామకృష్ణ రెడ్డి భౌతిక కాయం స్వగ్రామానికి చేరింది. గన్నవరం ఎయిర్ పోర్టులో వీర జవాన్ కు గణ నివాళి అర్పించారు ప్రముఖులు. వీరుడి భౌతిక కాయానికి గౌరవ వందనం చేసిన అనంతరం స్వగ్రామానికి ప్రభుత్వ లాంచనాలతో తరలించారు. మంగళవారం అధికారిక లాంచనాలతో మట్టి అంత్యక్రియలు జరగనున్నాయి. రామకృష్ణ రెడ్డి మృతితో కుంటుంబ, బంధువులు శోకసంద్రంలో మునిగితేలారు. 'చిన్ననాటి నుండే మాకు దేశ భక్తిపట్ల ప్రేమ నేర్పించాడు. మాకు మా నాన్నే హీరో. ఆయన స్పూర్తితోనే నేను మర్చంట్ నేవీలో చేరాను' అని రామకృష్ణ రెడ్డి పెద్ద కుమారుడు రవికాంత్ రెడ్డి కన్నీటిపర్యంతమయ్యాడు.

అలాగే శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో కృష్ణాజిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన జవాను సాదరబోయిన నాగరాజు కూడా (32) మృతిచెందారు. చేవేండ్ర ఉప్పరగూడెం ప్రాంతానికి చెందిన సాదరబోయిన వెంకన్న పెద్దకుమారుడైన నాగరాజు ఎనిమిదేళ్ల క్రితం ఆర్మీలో చేరారు.

#army-jawan-ramakrishna-reddy #prakasham #ladakh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి