చాలా మందికి హైదరాబాద్(Hyderabad)లో ఓటు ఉండి కూడా వెయ్యలేదన్న విషయం తెలిసిందే. ప్రతీసారి ఎన్నికల్లో హైదరాబాద్ నుంచే తక్కువ ఓటింగ్ శాతం నమోదు అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ తక్కువ ఓటింగ్ శాతానికి కేవలం భాగ్యనగర వాసుల బద్ధకం ఒక్కటే కారణం కాదు.. అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని తెలుస్తోంది. రూల్స్ ప్రకారం ఒక చోట ఓటర్ కార్డ్(Voter Card) ఉన్నవాళ్లకి వేరే చోట ఉండకూడదు. ఇక ఏపీ(AP)కి చెందిన చాలామంది హైదరాబాద్లో సెటిలై ఉంటారు. జాబ్ కోసం భాగ్యనగరానికి వచ్చి అక్కడే స్థిరపడిపోతారు. పనిలోపనిగా ఓటర్ కార్డ్కు కూడా అప్లై చేసుకుంటారు. కానీ సొంతేరిలో ఉన్న ఓటును రద్దు చేయించుకోరు.. అధికారులు కూడా పట్టించుకోరు. తెలంగాణ ఎన్నికల వేళ ఈ ఆసక్తికర విషయం బయటపడింది. ఇక నాలుగు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో డబుల్ ఎంట్రీ ఓట్లుపై ఏపీ మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..AP Elections 2024: వారిని ఓటుకు అనుమతించకూడదు.. సీఈవోకు వైసీపీ మినిస్టర్స్ ఫిర్యాదు!
డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు వైసీపీ మంత్రులు. ఏపీ, హైదరాబాద్లో రెండు చోట్లా 4,30,264 ఓట్లు ఉన్నాయని CEO మీనాకు మంత్రులు జోగి రమేశ్, వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ లో ఓటు వేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు.
Translate this News: