Gudivada amarnath vs Pawan: చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వయాగ్రా లాంటివాడు.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

బలహీనపడిన టీడీపీని నువ్వు నడిపి బలవంతుడైన ఫీలింగ్‌లో ఉన్నావంటూ పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఫైర్ అయ్యారు. పవన్‌ వయాగ్రా టాబ్లెట్ అందిస్తేనే కాని చంద్రబాబు బలం చూపించలేడంటూ కామెంట్స్ చేశాడు. చంద్రబాబుకి నువ్వు వయాగ్రా టాబ్లెట్ లాంటి వాడివని మండిపడ్డారు అమర్నాథ్‌.

New Update
Gudivada Amarnath: తుప్పు పట్టిన సైకిల్-పగిలిపోయిన గ్లాసు గోల్డ్ కవరింగ్.. మంత్రి అమర్నాథ్ సెటైర్లు

ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌(Gudivada amarnath) మరోసారి తన నోటికి పని చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబుపై నిరంతరం నిప్పులు చెరిగే ఈ మంత్రి మరోసారి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. బాగా బలహీనపడిన టిడిపి(TDP)కి తమ పార్టీ సపోర్ట్ ఇచ్చి బలపడేలా చేసిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అమర్నాథ్‌ ఘాటుగా స్పందించారు. 75 సంవత్సరాలు వచ్చిన చంద్రబాబు నాయుడు ఇంకెక్కడ బలం చూపిస్తాడని.. నీలాంటి(పవన్‌) వాడు వయాగ్రా టాబ్లెట్ అందిస్తేనే గాని చంద్రబాబు బలం చూపించలేడంటూ కామెంట్స్ చేశాడు. చంద్రబాబుకి నువ్వు వయాగ్రా టాబ్లెట్ లాంటి వాడివని ఫైర్ అయ్యారు అమర్నాథ్‌.

మంత్రి ఇంకేం అన్నారంటే?

• బలహీనపడిన టిడిపి పార్టీని నువ్వు నడిపి బలవంతుడైన ఫీలింగ్ లో వున్నావు...

• రెండు చోట్ల పోటీ చేసిన నువ్వు ఓడిపోయావు

• మిగిలిన చోట్ల పార్టీకి డిపాజిట్లు కూడా లేవు

• అంటే నీ టాబ్లెట్ కూడా పనిచేయదు.

• పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న వారిని చూశాం కానీ విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న వారిని చూస్తున్నాం..

• 2014లో కలిసి పోటీ చేసిన టిడిపి జనసేన 2019లో విడాకులు తీసుకుని మళ్లీ 2024లో కలిసి పోటీ చేస్తున్నారు.

• బిజెపితో పెళ్లి టిడిపి తో సంసారం చేస్తుంది జనసేన పార్టీ.

• ఇటువంటి అనైతిక చర్యలకు పవన్ కళ్యాణ్ పాల్పడుతున్నాడు.

అమర్నాథ్‌పై జనసైనికులు ఆగ్రహం:
మంత్రి గుడివాడ అమర్నాథ్‌కి జనసేన మద్దతుదారులకు నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్‌మీడియాలో గుడివాడ అమర్నాథ్‌కి రకరకాల పేర్లు పెట్టి ట్రోల్ చేస్తుంటారు. ఇటు అమర్నాథ్‌ కూడా ఎక్కడా బ్యాక్‌ స్టెప్‌ వేయరు. జనసైనికులు రెండు మాటలంటే.. మంత్రి మూడు మాటలంటారు. తర్వాత ఇష్యూ పెద్దదవుతుంది. ఇక అమర్నాథ్‌ మరోసారి పవన్‌ కళ్యాణ్‌పై వ్యక్తిగతంగా కామెంట్స్ చేశారని జనసైనికులు మండిపడుతున్నారు. అసలు పవన్‌ పెళ్లి మేటర్‌ అమర్నాథ్‌కి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పవన్‌ పెళ్లి, విడాకుల విషయాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి అసలు మాట్లాడరా అని నిలదీస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు సైతం జనసైనికులకు కౌంటర్లు వేస్తున్నారు. జనసేన నేతలు కూడా వైసీపీ మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

ALSO READ: తెలంగాణలో బిల్లా రంగాలు ఇద్దరు జనం మీద పడ్డారు.. రేవంత్‌రెడ్డి హాట్‌ కామెంట్స్!

CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL

Advertisment
తాజా కథనాలు