రెండు తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలకల వ్యాధి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. రోజు రోజుకూ ఈ కేసుల సంఖ్య పెరుగుతూండటంతో.. కంటి ఆస్పత్రుల వద్ద రోగులు క్యూ కట్టారు. ముఖ్యంగా పాఠశాలల్లో ఈ కండ్లకల ఈ వ్యాధి మరింత విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కండ్ల కలకపై పిల్లలకు అవగాహన లేకపోవడం వల్లనే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని పేర్కొంది.
పూర్తిగా చదవండి..విజృంభిస్తున్న కండ్లకలకలు.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
ఈ వ్యాధిపై పిల్లలలో అవగాహన పెంచేవిధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ సర్కార్ సూచించింది. కండ్లకలక లక్షణాలు ఎలా ఉంటాయి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే ఏం చేయాలి? అనే దానిపై ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అవగాహన కలిగేలా ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది. కళ్లు నొప్పిగా ఉండటం, దురద రావడం, వాపు రావడం, కళ్లు ఎర్రగా మారి నీరు రావడం, నిద్ర లేచిన తర్వాత కళ్లు అతుక్కుపోవడం లాంటివి ఏర్పడితే కండ్ల కలక సోకినట్లే..
Translate this News: