Gidugu Rudra Raju: చిరంజీవి కాంగ్రెస్లోనే ఉన్నారు... గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చిరంజీవిపై ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారని స్పష్టం చేశారు. చిరంజీవి ఇంకా ఏఐసీసీ సభ్యులుగానే కొనసాగుతున్నారని పేర్కొన్నారు. ఆయన ఇంకా కాంగ్రెస్ కు రాజీనామా చేయలేదని తెలిపారు. By V.J Reddy 09 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Gidugu Rudra Raju: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మెగాస్టార్ చిరంజీవి సాయం చేయడంపై ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారని స్పష్టం చేశారు. తమ్ముడు అని పవన్ కళ్యాణ్ కు చిరంజీవి సహాయం చేసి ఉంటారు అని అన్నారు. చిరంజీవి ఇంకా ఏఐసీసీ సభ్యులుగానే కొనసాగుతున్నారని పేర్కొన్నారు. చిరంజీవి ఇంకా కాంగ్రెస్ కు రాజీనామా చేయలేదని తెలిపారు. ALSO READ: సీఎం కేజ్రీవాల్కు బిగ్ షాక్ రాజమండ్రిలో కాంగ్రెస్ సెంట్రల్ ఆఫీస్, ప్రచార వాహనాలు ప్రారంభించిన ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత్ కిషోర్ పెయిడ్ ఆర్టిస్ట్ అని చురకలు అంటించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని సోమవారం పురంధేశ్వరి అన్నారని ఆరోపించారు. టీడీపీ, జనసేనలు పురంధేశ్వరి వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేశారు. పురంధేశ్వరి వలస పక్షి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచినా రాజమండ్రిలో ఉండరని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రాజమండ్రి సమగ్రంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఉండవల్లి ఎంపీగా ఉన్నప్పుడే రాజమండ్రి ఎయిర్ పోర్ట్ బాగా అభివృద్ధి చెందిందని వివరించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని.. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేది కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చారు. #chiranjeevi #gidugu-rudra-raju #ap-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి