/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Amanchi-Krishnamohan-jpg.webp)
Amanchi Krishnamohan: వైసీపీకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు. ఈ నెల 9న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. ఇటీవల పర్చూరు ఇంఛార్జికి రాజీనామా చేసిన ఆయన.. చీరాల వైసీపీ టికెట్ ఆశించారు. అయితే.. చీరాల టికెట్ ను వైసీపీ అధిష్టానం కరణం వెంకటేష్ కు ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్న ఆమంచి పార్టీకి రాజీనామా చేశారు. కాగా.. త్వరలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మరోవైపు రానున్న ఎన్నికల్లో చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. 2009, 2014లో చీరాలలో ఆమంచి గెలిచారు. 2019లో కరణం బాలరాం చేతిలో ఆమంచి ఓటమి చెందారు.