BREAKING: నన్ను చంపేస్తారు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరో రెండు నెలల్లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. బెదిరింపు కాల్స్ చేసే వాళ్లని వదిలిపెట్టమని హెచ్చరించారు.

New Update
BREAKING: నన్ను చంపేస్తారు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Velagapudi Ramakrishna Babu: ఆంధ్ర పోరాడిష్ లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ విశాఖ ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు సంచలన ఆరోపణలు చేశారు. తనకు చంపేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఈ మేరకు విశాఖ నగర పోలీస్ కమీషనర్ కు కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిపారు. "నిన్ను ఉంచమ్.. చంపేస్తామంటూ" పలు ఇంటర్నేషనల్ నంబర్లతో బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన పేర్కొన్నారు. విశాఖ లో విష సంస్కృతి పెరిగిందని అన్నారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై మొన్న ఎంవీపీ సీఐ కి ఈ రోజు సీపీకి కంప్లైంట్ ఇచ్చానని అన్నారు.

ALSO READ: బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

నాకు నమ్మకం లేదు..

రక్షణ కల్పించడం విషయంలో వైసీపీ ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని అన్నారు ఎమ్మెల్యే వెలగపూడి. బూత్ లెవెల్ కార్యకర్తలపై కూడా అన్యాయంగా బైండోవర్ కేసులను ఈ వైసీపీ ప్రభుత్వ నేతలు పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని కూడా సీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

వచ్చే మాదే.. వదలం..

రెండు నెలల్లో వచ్చేది తమ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వెలగపూడి. ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన వారిని వదిలి పెట్టేది లేదని అన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రాజకీయ నాయకులకు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం తెలియదని అన్నారు. ఎవరితో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. వైసీపీ నేతలే తనపై కుట్రపూరితంగా ఇలాంటి బెదిరింపు కాల్స్ చేయిస్తున్నారని ఆరోపణలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు