BJP Purandeswari : రాజమండ్రిలో గెలవబోతున్నా : ఆర్టీవీకి పురంధేశ్వరి స్పెషల్ ఇంటర్వ్యూ

ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రిలోనూ తాను గెలవబోతున్నానన్నారు. ఆర్టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఈసీ సమర్థవంతంగా నిర్వహించిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

New Update
BJP Purandeswari : రాజమండ్రిలో గెలవబోతున్నా : ఆర్టీవీకి పురంధేశ్వరి స్పెషల్ ఇంటర్వ్యూ

Purandeswari RTV Special Interview : ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో (AP Elections) కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఏపీ బీజేపీ (BJP) చీఫ్ పురంధేశ్వరి (Purandeswari) ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ (YCP) మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనబడిందన్నారు. ఆర్టీవీ (RTV) తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. వైసీపీ నేతలు అభద్రతా భావంతో ఉన్నారన్నారు. ఆర్టీవీకి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అధికారులు తప్పులు చేస్తున్నారు కాబట్టే వాళ్ళని తప్పించాలని లేఖలు రాశానన్నారు.

వైసీపీ నేతలు టార్గెట్ చేసినా తనకేం జరగదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకున్నానన్నారు. ఎన్నికల నిర్వహణను ఈసీ సమర్థవంతంగా నిర్వహించిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. బ్యాలెట్ ఓటర్లు ఓటు వేసిన తీరును అందరూ అభినందిస్తున్నారన్నారు. రాజమండ్రిలో ప్రజలు మంచి స్పందన చూపించారన్నారు. పురంధేశ్వరి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Also Read : ఈ అవకాశం నాకు మాత్రమే వచ్చింది.. AB వెంకటేశ్వర రావు ఎమోషనల్.. !

Advertisment
తాజా కథనాలు