Pawan Kalyan: వ్యూహం మార్చిన పవర్ స్టార్.. భీమవరంతో పాటు ఆ సంచలన స్థానం నుంచి పోటీకి సై!

రానున్న ఏపీ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో ఉన్న పవన్ కల్యాణ్ గతంలో పోటీ చేసిన భీమవరంతో పాటు తిరుపతి నుంచి కూడా పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం తిరుపతి జనసేన నేతలతో ఆయన సమావేశం అయ్యారు.

New Update
Pawan Kalyan: వ్యూహం మార్చిన పవర్ స్టార్.. భీమవరంతో పాటు ఆ సంచలన స్థానం నుంచి పోటీకి సై!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ ఎన్నికల్లో కూడా రెండు సీట్ల నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పవన్ గాజువాక, భీమవరం రెండు సీట్ల నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ రెండు స్థానాల్లోనూ ఆయన ఓటమిపాలయ్యారు. అయితే, ఈ ఎన్నికల్లో సైతం పవన్ కళ్యాన్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే.. గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరంతో (Bheemavaram) పాటు ఈ సారి కొత్తగా తిరుపతి (Tirupati) నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Kodali Nani: పీకేను పూర్తిగా వాడేశాం.. ఆయన బుర్రలో గుజ్జంతా ఖాళీ: కొడాలి నాని సెటైర్లు

భీమవరం జరిగిన వారాహీ యాత్రలో (Varahi Yatra) మళ్లీ తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానన్న సంకేతాలను పవన్ ఇచ్చారు. ఇటీవల తిరుపతి నియోజకవర్గంపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం తిరుపతి జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడ జనసేన పరిస్థితి, టీడీపీ సహకారం, జనసేన బలాబలాలపై నేతలతో పవన్ చర్చించినట్లు తెలుస్తోంది.

అయితే.. గతంలో ఓటమి అనుభవంతో ఈ సారి రెండు నియోజకవర్గాల్లో తప్పనిసరిగా గెలవాలన్న ఆలోచనతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గతంలో ప్రజారాజ్యం ఆవిర్భావం సమయంలో చిరంజీవి సైతం రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. పాలకొల్లుతో పాటు తిరుపతి నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో పాలకొల్లులో ఓడిపోయిన చిరంజీవి.. తిరుపతిలో మాత్రం విజయం సాధించారు. అయితే.. అప్పుడు చిరంజీవి చేతిలో ఓటమి పాలైన భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు