AP Politics : కుప్పంలో చంద్రబాబును ఓడించడం ఖాయం : మంత్రి పెద్దిరెడ్డి

కుప్పంలో ఈ సారి చంద్రబాబును ఓడించడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఈ రోజు కుప్పం వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు.

AP Politics : కుప్పంలో చంద్రబాబును ఓడించడం ఖాయం : మంత్రి పెద్దిరెడ్డి
New Update

YCP : కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నామినేషన్ కార్యక్రమంలో ఎవరైనా బయట రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నట్లు నిరూపిస్తే.. తాను నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానన్నారు. టీడీపీ(TDP) నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఈనెల 26న వైసీపీ మేనిఫెస్టో..నవరత్నాల అప్‌గ్రేడెడ్ వెర్షన్?

ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి(Peddi Reddy) సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పంలో చంద్రబాబు(Chandrababu) ను ఓడించడం ఖాయమన్నారు. కుప్పం(Kuppam) లో చంద్రబాబు ఓడిపోతాడనే భయంతో అన్ని చోట్ల తన గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు.

#tdp #ap-ycp #kuppam #minister-peddi-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe