Lok Poll Survey : ఏపీలో ఆ పార్టీదే హవా.. తేల్చేసిన సర్వే ఫలితాలు!

లోక్‌ పోల్‌ సర్వే ఎన్డీఏకు పట్టం కట్టింది. 25 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమికి 13-15 స్థానాలు దక్కుతాయని లోక్‌ పోల్‌ గ్రౌండ్‌ రిపోర్ట్ చెబుతోంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Lok Poll Survey : ఏపీలో ఆ పార్టీదే హవా.. తేల్చేసిన సర్వే ఫలితాలు!
New Update

AP : ఏపీలో ఎన్నికల(Elections) హీట్‌ పొగలు రేపుతోంది. నువ్వా నేనా అనే రేంజ్‌లో పోటీ ఖాయంగా కనిపిస్తోంది. అటు అసెంబ్లీ.. ఇటు పార్లమెంట్‌ స్థానాల్లో తీవ్ర పోటి నెలకొంది. ఏ పార్టీ గెలిచినా ఎడ్జ్‌తోనే గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. తాజాగా లోక్‌ పోల్‌ సర్వేలోనూ ఇదే తేలింది. 'లోక్‌ పోల్‌'(Lok Poll) గ్రౌండ్‌ రిపోర్ట్‌లో ఎన్డీఏ కూటమికి ఎడ్జ్‌లో మెజారిటీ వచ్చింది. లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఈ రిపోర్ట్ వచ్చింది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలలో ఎన్టీఏ(బీజేపీ-జనసేన-టీడీపీ)(BJP-Janasena-TDP) కి 13-15 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయని లోక్‌ పోల్‌ చెబుతోంది. వైసీపీ(YCP) కి 10-11 సీట్లు దక్కుతాయని అంచనా వేస్తోంది. అటు కాంగ్రెస్‌కు ఒక స్థానం వచ్చే అవకాశం ఉందని అంచాన వేసింది.



Also Read : ‘క్లిక్‌ హియర్‌…’ ట్విట్టర్‌లో ఎక్కడ చూసినా ఇదే ట్రేండ్‌.. ఇంతకి ఏంటిది? ఎలా పెట్టాలి?

#ap-elections-2024 #lok-poll-survey #bjp-janasena-tdp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe