వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) టికెట్ల కేటాయింపుపై ఫుల్ ఫోకస్ పెట్టారు. జనవరి 1 నాటికి టికెట్ల కేటాయింపును పూర్తి చేసి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు జగన్. ఇందులో భాగంగా ముఖ్య నేతలతో ఆయన ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాపై ఫోకస్ పెట్టిన వైసీపీ అధినేత జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మర్చాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పెడన, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, పెనమలూరు, అవనిగడ్డ, గన్నవరం, తిరువూరులో అభ్యర్థుల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పెడన నుండి ఉప్పాళ్ల హారిక, విజయవాడ సెంట్రల్లో వంగవీటి ఫ్యామిలీ నుంచి ఒకరు, విజయవాడ వెస్ట్లో నిమ్రా కాలేజ్ చైర్మన్ రసూల్ ఖాన్ ను పోటీకి దించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: AP Elections 2024: పల్నాడు వైసీపీలో టికెట్ల పంచాయితీ.. మంత్రి అంబటితో పాటు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితేంటి?
Krishna Dist YCP List: కృష్ణా జిల్లా వైసీపీ అభ్యర్థులు వీరే.. పూర్తి లిస్ట్!
న్యూ ఇయర్ ప్రారంభంలోగా వైసీపీ పూర్తి అభ్యర్థులను ప్రకటించాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం జగన్ కీలకమైన కృష్ణా జిల్లా అభ్యర్థుల లిస్ట్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. జిల్లాలో మొత్తం ఏడుగురు అభ్యర్థులను మార్చాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.
Translate this News: