AP CM jagan: మేనల్లుడి నిశ్చితార్థానికి హాజరుకానున్న జగన్‌!

వైఎస్‌ షర్మిల,బ్రదర్ అనిల్‌ కుమార్ ల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి , అట్లూరి ప్రియల నిశ్చితార్థం జనవరి 18న హైదరాబాద్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు.

AP CM jagan: మేనల్లుడి నిశ్చితార్థానికి హాజరుకానున్న జగన్‌!
New Update

Ap CM: ఏపీ ముఖ్యమంత్రి(AP Chief Minister) వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి (Ys jagan) గురువారం (జనవరి18) హైదరాబాద్‌ కు రానున్నారు. వైఎస్‌ షర్మిల (Ys Sharmila) , బ్రదర్ అనిల్ కుమార్‌ ల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి(Rajareddy)  నిశ్చితార్థం (Engagement) గుండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్‌ లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్‌ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ రానున్నట్లు సమాచారం.

వైఎస్‌ రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థం జనవరి 18న జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు వైఎస్సాఆర్‌ కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ నాయకులు చాలా మంది తరలి వస్తున్నారు. వైఎస్‌ షర్మిల రాజకీయాలకు అతీతంగా చాలా మంది రాజకీయ ప్రముఖులకు కుమారుడి వివాహ పత్రికను అందజేశారు.

ఎంగేజ్‌మెంట్‌ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు..

ఆ తరువాత హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ ఆహ్వానాలను కూడా ఇప్పటికే పలువురు ప్రముఖులకు షర్మిల అందించారు. రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం ఫిబ్రవరి 17న జరగనుంది. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే తన అన్న సీఎం జగన్‌ ను కలిసి రావాలని ఆహ్వాన పత్రిక అందించారు.

publive-image

సోషల్‌ మీడియాలో వైరల్‌..

ఇందుకు జగన్‌ అంగీకరించినట్లు షర్మిల స్వయంగా తెలిపారు. ప్రస్తుతం నెట్టింట్లో ఎంగేజ్‌మెంట్, వివాహం అనంతరం నిర్వహించే రిసెప్షన్‌ ఆహ్వాన పత్రికలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్‌ కూడా హాజరవుతున్నట్లు షర్మిల సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి 17న జోధ్‌పూర్ లో రాజారెడ్డి- ప్రియ వివాహం జరగనుంది. ఫిబ్రవరి 24న పోస్ట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్ ను వైఎస్సాఆర్‌ కుటుంబం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని శంషాబాద్‌ ఫోర్ట్‌ గ్రాండ్‌ లో ఈ రిసెప్షన్‌ ను నిర్ణయించారు. వైఎస్సాఆర్‌ మరణించిన తరువాత వారి కుటుంబంలో ఇదే మొదటి శుభకార్యం కావడంతో రాజకీయాలకు అతీతంగా ప్రముఖులందరూ హాజరవుతారని సమాచారం.

అరగంట పాటు..

ఈ సందర్భంగా జగన్‌ సాయంత్రం 7 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకుని అక్కడ నుంచి నిశ్చితర్థానికి చేరుకుంటారు. అక్కడ సుమారు అరగంట పాటు ఈ వేడుకలో ఉంటారు. ఆ తరువాత అక్కడ నుంచి బయల్దేరి విజయవాడకు చేరుకుంటారు.

Also read: చిరంజీవి హీరో కాదు..విలన్‌..అంటూ సీనియర్‌ నటి సంచలన వ్యాఖ్యలు!

#ys-rajareddy #atluri-priya #hyderabad #ys-jagan #engagement #ys-sharmila
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe