AP CM Jagan London Tour: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో వీరిద్దరూ ఏ1, ఏ2 నిందితులుగా ఉన్నారు. గతంలో సీబీఐ అరెస్ట్ చేయడంతో బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లాలన్న నిబంధన ఉంది. ఈ కారణంగా వీరిద్దరి పాస్ పోర్టులు కోర్టు ఆధీనంలో ఉంటాయి. విదేశీ పర్యటనకు వెళ్లాల్సినప్పుడల్లా కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
పూర్తిగా చదవండి..AP CM Jagan London Tour: ఏపీ సీఎంకు సీబీఐ కోర్టు పర్మిషన్.. వచ్చే నెల 2న విదేశాలకు జగన్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. దీంతో సీఎం జగన్ లండన్ వెళ్లనున్నారు. వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సీఎం విదేశీ పర్యటనలో ఉండనున్నారు. మొత్తం 10 రోజుల పాటు కుటుంబంతో కలిసి యూకేలో ఉన్న తమ కూతుళ్లను చూసేందుకు సీఎం జగన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Translate this News: