/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/jagan-3.jpg)
Ap Politics: ఏపీలో సోమవారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మరోసారి ఏపీలో అధికారం చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు జగన్ అన్నారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు. అందులో రానున్న రోజుల్లో మరోసారి వైసీపీనే రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
ఆ ట్వీట్ లో ''నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యవతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.మన @YSRCParty గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను.'' అంటూ రాసుకొచ్చారు.
నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యవతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు… pic.twitter.com/o5BrhvGeRa
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2024
Also read: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే మఖానాని ఇలా తినాల్సిందే!