Anushka Sharma : గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సందడి చేసిన అనుష్క!

New Update
Anushka Sharma : గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సందడి చేసిన అనుష్క!

Gujarat : టీమిండియా క్రికెట్(Team India Cricket) దిగ్గజం విరాట్ కోహ్లీ(Virat Kohli) భార్య అనుష్క(Anushka) కుమారుడు అకాయ్ కోహ్లీ(Akai Kohli) జన్మించిన తర్వాత తొలిసారి బహిరంగంగా కనిపించారు. గత రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌ను అనుష్క స్టేడియంలో కూర్చుని వీక్షించారు.

అనుష్క నవ్వుతూ జట్టుకు మద్దతుగా చేతులు ఊపుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అయ్యాయి. ఆమె రాకతో స్టేడియంలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవల పుట్టిన రోజు జరుపుకొన్న అనుష్క ఫొటోలు కూడా సోషల్ మీడియాకెక్కాయి. ఆర్సీబీ జట్టు సభ్యులతో కలిసి అనుష్క తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు.  2021 కోహ్లీ-అనుష్క దంపతులు వామికకు జన్మనివ్వగా మూడేళ్ల తర్వాత కుమారుడు అకాయ్ కోహ్లీకి జన్మనిచ్చారు. టీమిండియా మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ మూవీలో అనుష్క ప్రస్తుతం నటిస్తున్నారు.

Also Read : ఐఎస్‌ఎల్‌ ఛాంపియన్ గా ముంబై.. రెండో టైటిల్‌ కైవసం!

Advertisment
తాజా కథనాలు