Nizamabad Serial Murder Case: నిజామాబాద్ ఆరుగురి హత్యల్లో మరో ట్విస్ట్..ఏడో హత్య కూడానా?

నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఆరు హత్య కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వెచ్చింది. సోదరుడితోపాటు మరో ముగ్గురి సహాకారంతో హత్యలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రసాద్ తల్లి సుశీల ఆచూకీ లభించలేదని..సుశీల బతికే ఉందా? చంపేశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
Murder: ఏపీలో దారుణం.. భర్తను స్క్రూడ్రైవర్‌తో అక్కడ పొడిచి చంపిన భార్య!

Nizamabad Serial Murder Case: నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఆరుగురు హత్యల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఆస్తికోసమే పక్కా ప్లాన్ తో ఆరుగురిని చంపిన ప్రధాన నిందితుడు ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. గత నెల 28 నుంచి డిసెంబర్ 13 వరకు ప్రసాద్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఒక్కో చోటకు తీసుకెళ్లి హత్య చేశాడు.

ఈ ఆరుగురి హత్యల్లో మరో ట్విస్ట్ నెలకొంది. మ్రుతుడు ప్రసాద్ తల్లి సుశీల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. ఆమె బతికే ఉన్నారా లేదంటే ఆమెను కూడా చంపేశాడా అనే అనుమానం నెలకొంది. సోదరుడితోపాటు మరో ముగ్గురి సహకారంతో హత్యలు చేసినట్లు నిందితుడు ప్రశాంత్ ఒప్పుకున్నాడు. ఆస్తి కోసమే ఫ్రెండ్ ప్రసాద్ కుటుంబాన్ని చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు ప్రశాంత్. నేరం బయటకు రాకుండా ఒక్కొక్కరిని ఒక్కోచోట కాల్చి చంపాడు. ఈ ఆరుగురి హత్యల్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ముగ్గురిని తాను ఒక్కడినే చంపానని ఒప్పుకున్న ప్రశాంత్..మరో మూడు హత్యల్లో తన స్నేహితుల సహాయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

నిజమాబాద్ సదాశివ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాక్లుర్ కు నుంచి కొంతకాలం క్రితం మాచారెడ్డికి వలస వచ్చిన ప్రసాద్ ఫ్యామిలీ ఇక్కడే స్థిరపడింది. అయితే ప్రసాద్ కు మాక్లుర్ లో సొంత ఇళ్లు ఉంది. అయితే ప్రసాద్ కు బెస్ట్ ఫ్రెండ్ అయిన మాక్లుర్ కు చెందిన నిందితుడు ప్రశాంత్ (20 ఏళ్లు) ఆ ఇంటిపై కన్నేశాడు. ప్రసాద్ కు ఆర్థిక అవసరాలను గుర్తించిన ప్రశాంత్ లోన్ ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆ ఇంటిని తన పేరుపై ప్రశాంత్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అయితే లోన్ రాకపోవడంతో కొన్నాళ్లు వెయిట్ చేసిన ప్రసాద్.. తన ఇంటిని తిరిగి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కోరాడు. అయితే ఎలాగైనా ఆ ఇంటిని సొంతం చేసుకోవాలనుకున్న ప్రశాంత్ కొంతకాలం వాయిదావేస్తూ వచ్చాడు. అయితే ప్రసాద్ మరింత ఒత్తిడి చేయడంతో ఎలాగైన వదిలించుకోవాలని ప్లాన్ చేసిన ప్రశాంత్.. నిజామాబాద్ – కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ప్రసాద్ ను హతమార్చాడు. అయితే ప్రసాద్ కు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.

ఈ క్రమంలోనే ఒక రోజు తర్వాత ప్రసాద్ ఇంటికి వెళ్లిన ప్రశాంత్.. ప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి ఆయన భార్యను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చంపేశాడు. ఆమె డెబ్ బాడీని బాసర నదిలో వదిలేసి ఎవరికీ అనుమానం రాకుండా ఇంటికొచ్చాడు. అయితే ఇదే అదనుగా భావించిన ప్రశాంత్.. ఒక్కొక్కరిగా అందరినీ హత్య చేసేందుకు ప్లాన్ చేసి తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని చంపేశాడు. ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో ఇద్దరు పిల్లల ప్రాణం తీశాడు. అయితే మొదటి మూడు హత్యలు ఒక్కడే చేయగా.. మిగిలిన మూడు మరో ముగ్గురి సహాయంతో చేశాడు. చనిపోయిన వారందరూ ఒకే ఫ్యామిలీ కావడంతో ఎవరూ మిస్సింగ్ కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. నిందుతుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఇక డిచ్‌పల్లి హైవే దగ్గర ప్రసాద్ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రశాంత్ సదాశివనగర్‌లో ప్రసాద్‌ చెల్లి మృతదేహన్ని పాతిపెట్టాడు. బాసర గోదావరి నదిలో ప్రసాద్‌ భార్య డెడ్‌బాడీని పడేయగా.. బాల్కొండ సొన్ బ్రిడ్జి సమీపంలో ప్రసాద్‌ ఇద్దరు పిల్లల మృతదేహాలున్నాయి. మాచారెడ్డిలో ప్రసాద్‌ మరో చెల్లి మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా నేడు పోలీసులు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: షిర్డీసాయి ఎలక్ట్రికల్స్​పై ఐటీ రైడ్స్ – రెండో రోజు కొనసాగుతున్నసోదాలు!

Advertisment
తాజా కథనాలు