TDP : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) టీడీపీ అభ్యర్థుల స్థానాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికీ ఆ పార్టీ ఆన్ని స్థానాల అభ్యర్థుల పేర్లనూ ప్రకటించింది. ఈరోజు అందరికీ బీ ఫారాలను కూడా అందజేయనుంది. అయితే ఈ టైమ్లో టీడీపీ అధిష్టానం నాలుగు, లేదా ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సర్వేలు, ఫలితాలు, గెలుపోటముల టాక్లను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ విషయం చర్చించేందుకే ఎంపీ రఘురామకృష్ణరాజు(Raghu Rama Krishna Raju), మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎస్సీ సెల్ నేత ఎంఎస్ రాజు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు
ఇంకా కాసేపట్లో బీ-ఫారాలు అందజేస్తారు అనగా ఇప్పుడు ఆంధ్రా టీడీపీ అభ్యర్థుల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి, దెందులూరు అభ్యర్థుల స్థానాలను మార్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనిపై మరికొంత సేపటిలో క్లారిటీ రానుంది.
Translate this News: