Jogi Ramesh : జోగి ఇంటి ముందు అత్యుత్సాహం ప్రదర్శించిన యువకులు!

ఇబ్రహీంపట్నం వినాయకుడి ఊరేగింపులో కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటి పై టపాసులు వేస్తూ యువకులు వీరంగం సృష్టించారు.జోగి రమేష్‌ ఇంటి ముందు వినాయకుడి ఊరేగింపును ఆపి, బాణాసంచా పేల్చడంతో పాటు , టీడీపీ జెండాలు ప్రదర్శించారు.

author-image
By Bhavana
New Update
jogi

Jogi Ramesh : వినాయక నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కూడా వినాయక నిమజ్జనాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం వినాయకుడి ఊరేగింపులో కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటి పై టపాసులు వేస్తూ యువకులు వీరంగం సృష్టించారు.

జోగి రమేష్‌ ఇంటి ముందు వినాయకుడి ఊరేగింపును ఆపి, బాణాసంచా పేల్చడంతో పాటు , టీడీపీ జెండా ప్రదర్శించారు.

Advertisment
తాజా కథనాలు