/rtv/media/media_files/2025/10/22/tdp-leader-1-2025-10-22-12-02-58.jpg)
కాకినాడ తుని కేసులో సంచలనం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. పోలీసు కస్టడీలోనే నిందితుడు నారాయణ ప్రాణాలు తీసుకున్నాడు. మెజిస్ట్రేట్ ముందు నారాయణరావును హాజరుపర్చడానికి తీసుకెళ్తుండగా టాయిలెట్ వస్తుందని చెప్పి పోలీసు వాహనం నుంచి కిందికి దిగిన నారాయణరావు తప్పించుకొని సమీపంలో ఉన్న తుని కోమటిచెరువులో దూకాడు. నిందితుడి కోసం గజ ఈత గాళ్లతో పోలీసుల గాలింపు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని డిఎస్పీ శ్రీహరిరాజు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడి డెడ్ బాడీ లభ్యమైంది.
నిందితుడు నారాయణరావు మృతిపై రూరల్ సీఐ చెన్నకేశవరావు వివరణ ఇచ్చారు. నిన్న సాయంత్రం ఐదు గంటలకి కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఎస్కార్ట్ తో తీసుకెళ్తుండగా చెరువు వద్ద ఈ ఘటన జరిగిందన్నారు. నిందితుడు నారాయణరావు వాష్ రూమ్ కెళ్ళిన క్రమంలో వర్షం పడడంతో పోలీసులు చెట్టు కిందకు వెళ్ళారని, ఆ సమయంలో ఒక్కసారిగా నిందితుడు చెరువులో దూకేసాడని చెప్పారు. రాత్రంతా వెతికీనా బాడీ దొరకలేదని, ఉదయం ఫైర్ , పోలీస్ సిబ్బంది గజ ఇతగాళ్లతో వెతకగా బాడీ దొరికిందని తెలిపారు. అతను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో సిగ్గుపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు లేదా అనుకోకుండా చెరువులో పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నామని సీఐ వెల్లడించారు.
తాతయ్య వరుస అవుతానంటూ
జగన్నాథగిరి గురుకుల బాలికల పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న బాలికకు తాను తాతయ్య వరుస అవుతానంటూ మాయమాటలు చెప్పి.. ఆ బాలికను స్కూల్ నుండి స్కూటిపై ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు టీడీపీ నేత తాటిక నారాయణరావు. అయితే నారాయణరావును తెలియకుండా ఓ వ్యక్తి అతన్ని ఫాలో అవుతూ వీడియో తీశాడు. దీంతో ఇంతంటి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో తీస్తూ ఉండగా బాలిక దుస్తులు వేసుకుంటూ ఉండగా ఆ బాలికను ఏం చేశావ్ అంటూ టీడీపీ నేతను వీడియో తీస్తున్న వ్యక్తి ప్రశ్నించాడు. సమాధానం చెప్పకుండా ఏం చేస్తావో చేసుకో అంటూ ఆ బాలికను బైక్ పై ఎక్కించుకుని పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గురుకుల పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులను పిలిపించి విచారణ చేపట్టారు. అయితే నారాయణరావు ఇప్పటికే నాలుగైదు సార్లు బాలికను బంధువులంటూ బయటికి తీసుకెళ్లడని హాస్టల్ వర్గాలు విచారణలో వెల్లడించాయి. దీంతో బాలికకు న్యాయం చేయాలంటూ గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు బాలిక కుటుంబసభ్యులు. అయితే కేసును రాజకీయ కోణంలో తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ రూరల్ ఎస్ఐ తో బాలిక కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు . ఈ కేసును ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలియగానే గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. తాటిక నారాయణరావుకు బడిత పూజ చేశారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.