ఒంగోలులో TTD గోవుల అమ్మకం.. కమిషన్ల కోసం ఏం చేశారంటే.. టీటీడీ చైర్మన్ సంచలన ఆరోపణలు!

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు.  ఐదేళ్లలో తిరుమలలో అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు.

New Update
BR Naidu TTD Goshala

తిరుపతి గోశాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గోశాలపై కొందరు గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదన్నారు. కొందరు పిల్‌ వేస్తామంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారన్నారు. వైసీపీ నేతల బెదిరింపులకు ఇక్కడెవరు భయపడరన్నారు. పింక్ డైమండ్ పైన అనవసర రాద్దాంతం చేశారన్నారు. పింక్ డైమండ్‌ పై ఓ పెద్దమనిషి పిల్ వేశారని.. అది ఇప్పటి వరకు ఏమైందో తెలియదన్నారు. ఐదేళ్లలో టీటీడీ నిధుల స్వాహాపై పిల్‌ వేయాలన్నారు.

అవకతవకలపై విచారణ

ఐదేళ్లలో తిరుమలలో అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు. వైసీపీ హయాంలో గత ఐదేళ్ళలో గోవుల గడ్డిని కూడా తినేశారన్నారు. గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారని సంచలన ఆరోపణలు చేశారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి దుర్మార్గుడని ధ్వజమెత్తారు. హరినాథరెడ్డి చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావన్నారు. గోవులతో ఆడుకున్న వ్యక్తి హరినాథరెడ్డని అన్నారు. గోశాలలో రికార్డులన్నీ హరినాథరెడ్డి ఎత్తుకుపోయారన్నారు. హరినాథరెడ్డి బాగోతం బయటపడుతుందని రికార్డులు ఎత్తుకెళ్ళాడన్నారు. 

బీజేపీ నేత సుబ్రమణ్యస్వామికి గత ఐదేళ్లలో గోశాలలో జరిగిన అన్యాయాలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. వైసీపీపై సుబ్రమణ్యస్వామి ఎందుకు పిల్ వేయలేదని ప్రశ్నించారు. గోశాలలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేస్తామన్నారు. గోశాలలో ఏం జరుగుతుందో కమిటీ తేలుస్తుందన్నారు. వైసీపీ చేసిన తప్పును తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరన్నారు. ఖచ్చితంగా సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానన్నారు. టీటీడీ మాజీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. 

(ttd | BR NAIDU | telugu-news | telugu breaking news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు