శ్రీవారి లడ్డూలో రూ. 500 కోట్ల స్కాం.. టికెట్లు అమ్ముకున్న మంత్రులు!

తిరుపతి లడ్డూల అమ్మకాల్లో రూ. 500 కోట్ల స్కాం జరిగిందని జనసేనపార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. రోజా, పెద్దిరెడ్డి మంత్రి హోదాలో రోజుకు వెయ్యి టిక్కెట్లు అమ్ముకున్నారన్నారు. వారంతా జైలుకెళ్లడం ఖాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

fdrer
New Update

Kiran Royal: తిరుపతి లడ్డూ వివాదం వేళ మరో సంచలన విషయం బటయకొచ్చింది. లడ్డూ అమ్మకాల్లో రూ. 500 కోట్ల స్కాం జరిగిందని జనసేనపార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. వైసీపీ నేతలు తిరుమల పవిత్రతను మంటగలిపారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు లడ్డూ వ్యవహారం బయటకు వచ్చి ఉంటే జగన్ ఘోరంగా ఓడిపోయేవాడని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కిరణ్‌ రాయల్.. లడ్డూను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. జగన్, వై.వి.సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు తప్పు చేయకుండా ఉంటే తిరుమలకు రావాలంటూ సవాల్ విసిరారు. 

యాగంలో జగన్ బృందం పాల్గొనాలి..

రేపు తిరుమలలో జరుగనున్న యాగంలో జగన్ బృందం పాల్గొనాలి. వై.వి.సుబ్బారెడ్డి, జగన్, ధర్మారెడ్డిలు తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించాలి. వైసీపీ హయాంలో వందల కోట్ల స్కాం జరిగింది. లడ్డూ వ్యవహారంలో అరెస్టులు జరిగేంత వరకు వెనక్కి తగ్గేది లేదు. సినీనటుడు ప్రకాష్ రాజ్ నాస్తికుడు. లడ్డూ గురించి మరోసారి ప్రకాష్ రాజ్ మాట్లాడితే నాలుక కోస్తాం. రోజా, పెద్దిరెడ్డి టిక్కెట్ల బాగోతం బయటపడింది. మంత్రి హోదాలో రోజుకు వెయ్యి టిక్కెట్లను అమ్ముకున్నారు. రోజా, పెద్దిరెడ్డిలు జైలుకెళ్లడం ఖాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

#jagan #Tirupati Laddu #kiran-royal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి