జగన్ మర్డర్‌కు చంద్రబాబు ప్లాన్..  ఇదే సాక్ష్యం: పోసాని సంచలనం!

జగన్‌ను మర్డర్ చేయించేందుకు సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని పోసాని కృష్ణమురళి అన్నారు. కరడుగట్టిన హిందూ వ్యతిరేకి అయిన బాబు కుట్రతోనే జగన్‌పై లడ్డూ బురద జల్లుతున్నారన్నారు. మోదీనే కాదు బతికుంటే అంబేడ్కర్‌ను కూడా బాబు మోసం చేసేవాడని మండిపడ్డారు. 

New Update
drererr

AP News: ఏపీ సీఎం చంద్రబాబు కరుడుగట్టిన హిందూ వ్యతిరేకి అని నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. తిరుపతి లడ్డూ వివాదంపై శనివారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. జగన్ పై చంద్రబాబు అనవసరంగా బురద జల్లుతున్నారని మండిపడ్డారు. జగన్ తిరుపతి వెళ్లాలంటే అఫిడవిట్ ఇవ్వాలా? అంటూ ఫైర్ అయ్యారు. అలాగే కొంతమంది జగన్ ఇస్తే తప్పేంటనే వాదనలపై ఫైర్ అయ్యారు. ఎందుకు ఇవ్వాలో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కుట్రలకు తెరలేపుతున్నారని, గతంలో అయ్యప్ప మాలల కారణంగా మద్యం అమ్మకాలు తగ్గి రాష్ట్ర ఆదాయానికి గండి పడుతోందని చంద్రబాబు మాట్లాడిన వీడియోను మీడియా ముందు చూపించారు. 

ఢిల్లీ వెళ్లి కాళ్లు మొక్కి పొత్తు పెట్టుకుని..

ఇక బీజేపీతో పొత్తు పెట్టుకోనని మసీదుకెళ్లినప్పుడు అల్లాహ్ సాక్షిగా చెప్పారని, ఇప్పడు అదే బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్ర ప్రజలను బాబు మోసం చేశారన్నారు. మోడీని సైతం చంద్రబాబు మోసం చేస్తున్నారని, ఢిల్లీ వెళ్లి కాళ్లు మొక్కి పొత్తు పెట్టుకుని ఇప్పుడు తాను ఏ పార్టీలో చేరనంటే వాళ్లే వచ్చి బతిమాలారని చెప్పడం హస్యాస్పదమన్నారు. 

నీవు ఎవడివి?

'జగన్ ను తిరుపతి రావొద్దనడానికి నీవు ఎవడివి? దేవుడు నీ కలలోకి వచ్చి చెప్పాడా? జగన్ ను మర్డర్ చేయించాలని ప్లాన్ చేస్తున్నావని మాకు తెలుసు. అలాంటి పని మాత్రం చేయబోకు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మోదీనే కాదు బతికుంటే అంబేడ్కర్‌ను కూడా మోసం చేసేవాడని మండిపడ్డారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు