AP CRIME: అత్తిలిలో దారుణం.. ఫుల్లుగా తాగి చంపుకున్న ఫ్రెండ్స్!

పశ్చిమగోదావరి జిల్లాఅత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో వీరాంజనేయులు(35), కడలి వెంకటనారాయణ మద్యం తాగిన సమయంలో పాత గొడవ పడ్డారు. మాట మాట పెరిగి వీరాంజనేయులు తలపై రాయితో వెంకటనారాయణ కొట్టాడు. వీరాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు.

New Update
ap crime attilli

West Godavari crime

AP CRIME: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తి హత్యకు దారి తీసింది. గ్రామానికి చెందిన జుత్తిగ వీరాంజనేయులు(35), కడలి వెంకటనారాయణ ఇద్దరు స్నేహితులు ఉన్నారు. మద్యం తాగిన సమయంలో పాత గొడవలు నేపథ్యంలో ఇరువురు స్నేహితులు  ఘర్షణ పడ్డారు. మాట మాట పెరిగి వీరాంజనేయులు తలపై రాయితో వెంకటనారాయణ కొట్టాడు. తలకు తీవ్ర గాయం కావటంతో వీరాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు.

పాత గొడవల నేపథ్యంలో..

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించి.. చుట్టు పక్కల వారిని ప్రమాద పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితులు వెంకటనారాయణ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

 

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో విషాదం.. కాబోయే భార్యను ఆటపట్టించబోయి మృతి.. అసలేమైందంటే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు