రానున్న 24 గంటల్లో భారీ తుపాను.. నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం భారీ తుపానుగా మారింది. దీంతో రానున్న 24 గంటల్లో నెల్లూరు - కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని, 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.