Nellore : ఏపీలో మరో దారుణం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం.. స్పాట్‌ లో 36 మంది!

కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరువకముందే ఏపీలో మరో దారుణం జరిగింది. ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. నెల్లూరులో లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఐరన్ బారికేడ్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.

New Update
nellore

కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరువకముందే ఏపీలో మరో దారుణం జరిగింది. ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. నెల్లూరులో లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఐరన్ బారికేడ్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద చోటుచేసుకుంది. ఐరన్ బారికేడ్ లేకపోతే బస్సు పల్టీ కొట్టే ప్రమాదం ఉండేది.

ఇద్దరు డ్రైవర్లతో పాటు 34మంది

ఈ ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు 34మంది ప్రయాణికులన్నారు.  అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే బస్సులోని ప్రయాణికులను ఇతర వాహనాల్లో తరలించారు.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  వరుసగా బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.

అటు మరోవైపు కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపద్యంలో నెల్లూరు రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.  RTO మదానీ  ఆధ్వర్యంలో పూలే బొమ్మ సెంటర్లో ప్రైవేట్ ట్రావెల్స్ ను అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా లేదని రెండు బస్సులను సీజ్ చేశారు అధికారులు.  

Advertisment
తాజా కథనాలు