/rtv/media/media_files/oPLiKsiInAqjGqqxq5r9.jpg)
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు-బెంగళూరు రహదారిపై మొగిలి గేట్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు రెండు లారీలను ఢీకొంది. ఈ విషాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2024
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్.. ఎనిమిది మంది మృతి
ఈ ఘటనలో 8 మంది చనిపోగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది https://t.co/LA90kXPNLN pic.twitter.com/pAmvx8oLNc