Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం కేసులో దూకుడు పెంచిన సిట్.. కీలక ఆధారాలు లభ్యం

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారంపై  కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దూకుడు పెంచింది.  సిట్ కు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. తాజాగా సిట్ కు కూడా ఆయనే లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కీలక ఆధారాలను సమర్పించారు.  

author-image
By Krishna
New Update
Liquor Scam in YCP’s Time

Liquor Scam in YCP’s Time

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారంపై  కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దూకుడు పెంచింది.  సిట్ కు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వం హాయంలో బేవరేజెస్ కార్పొరేషన్ కమిషనర్ వాసుదేవ రెడ్డి అక్రమాలపై  2024 లోనే సీఐడీకి ఫిర్యాదు చేశారు వెంకటేశ్వరరావు, శ్రీనివాస్.  అయితే వెంకటేశ్వరరావు ఫిర్యాదును సీఐడీ అధికారులు పట్టించుకోలేదు.  తాజాగా సిట్ కు కూడా వెంకటేశ్వరరావు లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కీలక ఆధారాలను సమర్పించారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబుపై  గతంలో  నమోదైన కేసులో కీలకంగా వ్యవహరించిన...ఈఎస్ శౌరి, డీజీఎం శరణ్, డీఈ సత్య ప్రసాద్, ఓఎస్డీ నాగేశ్వరరావు, అనసూయరెడ్డిలు -ప్రస్తుతం లిక్కర్ స్కాం కేసును పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

Also Read :  ట్రంప్‌ వార్నింగ్‌ ని పట్టించుకోని హమాస్‌...బందీలను విడుదల చేసేదే లేదంటూ ప్రకటన!

లిక్కర్ కుంభకోణంపై సిట్ ఏర్పాటు

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంపై ఏపీ సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇక ఇందులో సభ్యులుగా ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాస్, శ్రీహరిబాబు, డిఎస్పీ పీ. శ్రీనివాస్, సీఐ కే. శివాజీ, సీహెచ్ నాగ శ్రీనివాస్ లను నియమించింది-.  వైసీపీ హయాంలో ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లో అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికే ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసేందుకు సిట్ ఏర్పాటు చేయాలని డీజీపీ పంపిన ప్రతిపాదనల మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి 15 రోజులకొకసారి దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిట్ ను ప్రభుత్వం ఆదేశించింది.  

Also Read :  Bird Flu : బిగ్ షాక్.. మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ.. ఎక్కడో తెలుసా!

Advertisment
Advertisment
తాజా కథనాలు